చెన్నై న్యూస్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చెన్నై సమీపంలోని పుళల్ కవంగరై లోని తిరు నీలకంఠ నగర్ లోని తెలుగు మహిళలు సాంప్రదాయబద్ధంగా ఉసిరి చెట్టుకు పసుపు , కుంకుమ పూసి నైవేద్యాలు సమర్పించి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర హారతులు పట్టి అందరినీ చల్లగా దీవించాలని ప్రార్ధించారు. అలాగే తెలుగు సంఘ ముఖ్యనాయకులు జి మురళి ,బి కిష్టయ్య , పి నరసింహ రావు, ఎం చిట్టిబాబు, ఓబుల్ రెడ్డి, బి మురళి , ఇంకా తెలుగు ప్రజలు , పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను వినియోగం చేశారు.
పుళల్ కావంగరైలో భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టుకు పూజలు

More Stories
சட்ட மாமேதை டாக்டர் அம்பேத்கர் அவர்களின் 135வது பிறந்த நாளை முன்னிட்டு நாடு முழுவதும் மிகை எழுச்சியாக கொண்டாடப்பட்டது
தமிழ்நாடு வக்பு சொத்துக்களை காலக்கெடுவுக்குள் டிஜிட்டல் முறையில் அளவீடு செய்ய தமிழ் மாநில முஸ்லிம் லீக் வலியுறுத்தல்
Monica Singhal’s magical session “CURE IS SURE” in Chennai