చెన్నై న్యూస్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చెన్నై సమీపంలోని పుళల్ కవంగరై లోని తిరు నీలకంఠ నగర్ లోని తెలుగు మహిళలు సాంప్రదాయబద్ధంగా ఉసిరి చెట్టుకు పసుపు , కుంకుమ పూసి నైవేద్యాలు సమర్పించి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర హారతులు పట్టి అందరినీ చల్లగా దీవించాలని ప్రార్ధించారు. అలాగే తెలుగు సంఘ ముఖ్యనాయకులు జి మురళి ,బి కిష్టయ్య , పి నరసింహ రావు, ఎం చిట్టిబాబు, ఓబుల్ రెడ్డి, బి మురళి , ఇంకా తెలుగు ప్రజలు , పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను వినియోగం చేశారు.
పుళల్ కావంగరైలో భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టుకు పూజలు


More Stories
பல்லாவரத்தில் அதிமுகவினர் இடையே கோஷ்டி மோததால் பரப்பரப்பு.
JVS ARUMUGAM Submits Expression of Interest to Contest from Nellithope Constituency
மக்களின் சிரமங்களை தென்னக ரயில்வே துறை பொருட் படுத்தவில்லை- எஸ் ஆர் எம் யூ பொதுச் செயலாளர் கண்ணையா தெரிவித்துள்ளார்.