
చెన్నై న్యూస్:తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ(మద్రాసు యూనిట్) ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాడ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా దీప లక్ష్మీ పూజతో పాటు రంగనాయకి తాయారుకి సర్వ సౌభాగ్య సిద్ధి ప్రదాయని పూజ,ఎంతో విశేషమైన శ్రీ సూక్తం నామావళి పూజలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. మానవాళి ఆరోగ్యం, ఐశ్వర్యం ,లోకక్షేమం కోసం వైభవంగా ఈ పూజలను నిర్వహించారు. తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ నూతన అధ్యక్షురాలు అనితా రమేష్ ముందుగా స్వాగతోన్యాసం చేశారు.కార్యదర్శి లక్ష్మీ కర్లపాటి వందన సమర్పణ చేశారు.మహిళా సభ కోశాధికారి వసుంధర పాల్గొన్నారు.ముందుగా
స్వరార్ణవ బృందం ఆలపించిన భక్తి పాటలు ఆధ్యాత్మిక శోభను తెచ్చాయి.ఈ పూజలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు.తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ(మద్రాసు యూనిట్) తరపున ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కోసం దరఖాస్తులు అందజేశారు.
…


More Stories
கிங் மேக்கரின் முப்பெரும் விழா 20 ஆண்டுகள் நிறைவு செய்து 21வது ஆண்டில் அடி எடுத்துவைக்கிறது
AMPA SKYONE MALL HOSTS “MAGICAL VOICES & VIBES” CELEBRATING INCLUSIVE MUSICAL TALENT
Chennai Teen Nisha Sasikumar Becomes Youngest Woman in the World to Summit Mount Everest from Nepal Side