
చెన్నై న్యూస్:తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ(మద్రాసు యూనిట్) ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆషాడ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా దీప లక్ష్మీ పూజతో పాటు రంగనాయకి తాయారుకి సర్వ సౌభాగ్య సిద్ధి ప్రదాయని పూజ,ఎంతో విశేషమైన శ్రీ సూక్తం నామావళి పూజలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. మానవాళి ఆరోగ్యం, ఐశ్వర్యం ,లోకక్షేమం కోసం వైభవంగా ఈ పూజలను నిర్వహించారు. తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ నూతన అధ్యక్షురాలు అనితా రమేష్ ముందుగా స్వాగతోన్యాసం చేశారు.కార్యదర్శి లక్ష్మీ కర్లపాటి వందన సమర్పణ చేశారు.మహిళా సభ కోశాధికారి వసుంధర పాల్గొన్నారు.ముందుగా
స్వరార్ణవ బృందం ఆలపించిన భక్తి పాటలు ఆధ్యాత్మిక శోభను తెచ్చాయి.ఈ పూజలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. భక్తులందరికీ ప్రసాద వినియోగం చేశారు.తమిళనాడు ఆర్యవైశ్య మహిళా సభ(మద్రాసు యూనిట్) తరపున ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కోసం దరఖాస్తులు అందజేశారు.
…
More Stories
Labor of Love: Farmer Sundar Raj’s Story of Devotion and Resilience
சட்ட மாமேதை டாக்டர் அம்பேத்கர் அவர்களின் 135வது பிறந்த நாளை முன்னிட்டு நாடு முழுவதும் மிகை எழுச்சியாக கொண்டாடப்பட்டது
தமிழ்நாடு வக்பு சொத்துக்களை காலக்கெடுவுக்குள் டிஜிட்டல் முறையில் அளவீடு செய்ய தமிழ் மாநில முஸ்லிம் லீக் வலியுறுத்தல்