తిరుపతి న్యూస్: తిరుపతి శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత
శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. మంగళవారం
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 9 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో పార్థసారథి, సూపరింటెండెంట్ సోమశేఖర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
…
More Stories
వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవీ వసంతోత్సవాలు
ఘనంగా దక్షిణ ఇండియా వైశ్య సంఘం 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
அருள் ஒளி உறவின்முறை நல சங்கத்தின் சார்பில் 37 ஆம் ஆண்டு விழா