చెన్నై న్యూస్:శ్రీ ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. చెన్నై కొరట్టూర్ అగ్రహారం , రామాలయం వీధిలో ఉన్న సీతారామ కల్యాణ మండపంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సాగాయి. వేడుకలలో తొలుత స్రవంతి సభ్యులంతా కలసి కృష్ణపూజను భక్తిశ్రద్దలతో చేశారు. అనంతరం ఉట్టి కొట్టే పోటీ నిర్వహించగా, వృద్ధులు సైతం ఎంతో ఉత్సాహంతో ఉట్టికొట్టి సందడి చేశారు. తమిళనాడు, ఒడిస్సీ , ఆంధ్ర, తెలంగాణా నృత్యాలతో కనువిందు చేశారు
ఇంకా చిత్రలేఖన, పాటల పోటీలు అనంతరం హాస్య ప్రదర్శనలు కడుపుబ్బ నవ్వించాయి.ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు జేఎం నాయుడు, కోశాధికారి G .V .రమణ, సలహాదారు ఎం ఎస్ మూర్తి, ఉపాధ్యక్షులు K .N. సురేష్ బాబు , V.N. హరినాధ్, ఇంకా రాజేంద్రన్, ఐ.బాలాజి, డి.మనోహరన్, ఎంఎస్ నాయుడు తదితరులు అతిథులను ఇతోధికంగా సన్మానించారు. అనంతరం పలు పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
శ్రీ ఆంధ్ర కళాస్రవంతి ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?