- వి.కృష్ణారావు వ్యాఖ్య
చెన్నై విఆర్ న్యూస్: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి 151 వ జయంతి ఉత్సవాలు ద్రావిడ దేశం తరపున బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా చెన్నై, ప్యారీస్ లోని రాజా అన్నామలై మండ్రం సమీపంలో ఉన్న ఆంధ్రకేసరి శిలా విగ్రహానికి ద్రావిడ దేశం అధ్యక్షుడు వి. కృష్ణారావు పుష్పమాలతో అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ తెల్లదొరలకు ఎదురొడ్డి నిలిచి ధైర్యం ఉంటే నా రొమ్ముపై కాల్చండి అని సవాలు విసిరిన ధైర్యశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు. తాను సంపాదించిందంతా ప్రజాసేవ కొరకై వినియోగించి చివరి రోజుల్లో ఎన్నో కష్టాలు అనుభవించిన త్యాగశీలి అని అన్నారు. “అమర్ రహే అమర్ రహే ఆంధ్ర కేసరి అమర్ రహే”, ” వీరవందనం వీర వందనం ఆంధ్రకేసరికి వీర వందనం” అనే స్లోగాలతో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఘనంగా నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగు నాయకులు, వ్యాపారస్తులైన బక్కమంతుల వెంకట్రావు యాదవ్, ఎం.వెంగయ్య నాయుడు, మబ్బు పెంచలయ్య, పేర్ల బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
…
More Stories
Labor of Love: Farmer Sundar Raj’s Story of Devotion and Resilience
சட்ட மாமேதை டாக்டர் அம்பேத்கர் அவர்களின் 135வது பிறந்த நாளை முன்னிட்டு நாடு முழுவதும் மிகை எழுச்சியாக கொண்டாடப்பட்டது
தமிழ்நாடு வக்பு சொத்துக்களை காலக்கெடுவுக்குள் டிஜிட்டல் முறையில் அளவீடு செய்ய தமிழ் மாநில முஸ்லிம் லீக் வலியுறுத்தல்