చెన్నై న్యూస్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చెన్నై సమీపంలోని పుళల్ కవంగరై లోని తిరు నీలకంఠ నగర్ లోని తెలుగు మహిళలు సాంప్రదాయబద్ధంగా ఉసిరి చెట్టుకు పసుపు , కుంకుమ పూసి నైవేద్యాలు సమర్పించి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. కర్పూర హారతులు పట్టి అందరినీ చల్లగా దీవించాలని ప్రార్ధించారు. అలాగే తెలుగు సంఘ ముఖ్యనాయకులు జి మురళి ,బి కిష్టయ్య , పి నరసింహ రావు, ఎం చిట్టిబాబు, ఓబుల్ రెడ్డి, బి మురళి , ఇంకా తెలుగు ప్రజలు , పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను వినియోగం చేశారు.
పుళల్ కావంగరైలో భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టుకు పూజలు


More Stories
‘Drug Free Tamil Nadu 1000 people participated in the Grand human chain rally.
శోభా రాజా నివాసంలో వైభవంగా వరలక్ష్మీ పూజలు
கோவையை அதிர விடும் போதைப்பொருள் மன்னன்… ஆளும் கட்சி ஆதரவில் அட்டூழியமா? – யார் இந்த அரவிந்த்?