చెన్నై న్యూస్ : చెన్నై షావుకారుపేట రామకృష్ణ వీధిలోని మద్రాసు మిర్చి వర్తక సంఘంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు S. శివకుమార్, కార్యదర్శి M. చెన్నకేశవులు,
ఉపాధ్యక్షుడు S K హిమామ్ భాషా, జాయింట్ సెక్రటరీలు V.ధనుంజయ నాయుడు, ఎస్.సెంథిల్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సంఘ సలహాదారులు M.మాధవయ్య పాల్గొని త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు నివాళు లర్పించారు. ఈ వేడుకల్లో సలహాదారులు S.బాలసుబ్రమణ్యం, కమిటీ సభ్యులు N.జనార్ధన్, S.రమేష్, V.మధుసూధన్, M. చెంబుబాబు, P. మురళి, ఒ.చంద్రశేఖర్, పి.దశయ్య , అకౌంటెంట్ రమేష్ తదితరులు పాల్గొని జెండా వందనం చేశారు.జాతీయ గీతాన్ని, దేశభక్తి గీతాలను అలపించి అందరికీ చాక్లెట్లు పంచిపెట్టారు
మద్రాసు మిర్చి వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు


More Stories
AMPA SKYONE MALL HOSTS “MAGICAL VOICES & VIBES” CELEBRATING INCLUSIVE MUSICAL TALENT
Chennai Teen Nisha Sasikumar Becomes Youngest Woman in the World to Summit Mount Everest from Nepal Side
మరపురాని మహామనిషి …ఎన్టీఆర్ -తమ్మినేని బాబు వ్యాఖ్య